jnj dharna ramchn

ధర్నా షురూ…

ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన పోరాట స్థలి “ధర్నాచౌక్”. ప్రభుత్వాలతో విసిగి వేసారిన అనేక ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసనలకు నీడనిచ్చిన మహా స్థలం “ధర్నాచౌక్”. ఇక్కడ జరిగిన వేలది కార్యక్రమాలను ప్రజలకు చూపాలనే తపనతో పగలనక ,రేయనక పనిచేశారు కలం వీరులైన విలేకరులు. ఇప్పుడు వారికే సమస్య వచ్చింది. ఆ సమస్య సాధన కోసం చేపట్టిన పోరాటానికి వేదికగా “ధర్నాచౌక్”నే ఎన్నుకున్నారు. అదీ ఈ రోజే.. అంటే జులై 18. న్యాయం కోసం ధర్నాకు…

Read Full News
IMG 20230717 WA0009

అన్నీ రెడీ..

దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు…

Read Full News
jnj17

రండి..కదలండి..

దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు…

Read Full News

ఆషాఢ శోభ..

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి తొలి బోనం సమర్పించారు. ఆషాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో మహంకాళికి బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రెండు రోజులపాటు జరుగనున్న జాతరలో నేడు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. బోనాల…

Read Full News
Screenshot 2023 07 16 132757

ఇవ్వాల్సిందే…

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి కేటాయించిన స్థలాలను వెంటనే ఆ సొసైటీకి అప్పజెప్పాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరించడమే కాక ఇంకా అవసరమైతే అధిక స్థలాన్ని కేటాయిస్తామని బట్టి హామీ ఇచ్చారు.

Read Full News
Screenshot 2023 07 16 104621

పాత బస్తీ బోనం…

హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయం వద్ద ఆలయ పండితులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అదే విధంగా లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read Full News
jnj c 1

తీర్పును లెక్క చేయరా..

సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా వ్యుహరచన చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా”…

Read Full News
junnu

బూజు+పురుగు=జున్ను

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ జాతీయ రహదారి పిల్లర్ నంబర్ 55 డెకత్లాన్ ఎదురుంగా స్వదేశీ హోటల్ లో బూజు పట్టిన జున్ను పెట్టడం వివాదంగా మారింది. హోటల్ కు వెళ్ళిన ఒక కుటుంబం జున్ను ఆర్డర్ చేసింది. తినే సమయంలో పరిశీలించగా అందులో ఒక పురుగు, బూజు కనిపించింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కస్టమర్ ల సహాయంతో యజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశ్నిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా…

Read Full News
tomto lory in1

అసలే కరువు..

ఆదిలాబాద్ జిల్లా మావల శివారు ప్రాంతాంలో 44వ జాతీయ రహదారి పై టమాట లారీ బోల్తా పడింది. రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలో  ఉన్న టమాటలన్ని రోడ్డుపై పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి  చేరుకున్నారు. టమాట ధర ఢిల్లీలో రూ. 300 పలుకుతుండగా ఆదిలాబాద్‌లో రూ. 150 నుంచి రూ. 180 వరకు పలుకుతుంది. విలువైనా టమాటలు ఎత్తుకెళ్లడానికి ఒక్కసారిగా జనం…

Read Full News
jwala c

ఆల్ ది బెస్ట్ …

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ఆధ్వర్యంలో జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 34 మంది వర్ధమాన బ్యాట్మెంటన్ క్రీడాకారులకు నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెమెంటులను అందజేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని జ్వాలా గుత్తా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Read Full News
sailaja ayyar

మంత్రిని కలిసిన శైలజ..

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శైలజ రామాయ్యర్ ఆ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యాటక శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించారు.

Read Full News
jnj 15

కదలండి..

హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ న్యాయమైన సమస్యని పరిష్కరించాలంటూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా…

Read Full News
Screenshot 2023 07 15 164917

సెలవు దొర..షురూ …

తెలంగాణలో బీఆరెస్ కు వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. కెసిఆర్ పాలనపై ఐదు సెకన్ల నిడివిగల వీడియోక్లిప్ ని విడుదల చేసింది. సాలు దొర… సెలవు దొర… అంటూ పిట్టల దొర పేరుతో ఈ వీడియో చక్కర్లు కోతుతోంది..

Read Full News
bonalu

సందడే సందడి…

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 17 తేదీ సోమవారం సెలవుగా నిర్నిణయించారు. ఆ రోజును సాధారణ సెలవుల’కింద జాబితాలో చేర్చారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ‘ఆషాడ’ మాసంతో బోనాలు మొదలవుతాయి. భక్తులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన కుండలలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి ఏటా హైదరాబాద్‌లో నెలరోజుల పాటు మూడు దశల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి…

Read Full News
dharna 1

పోరాటం ఆగదు…

జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్…

Read Full News