CRIME - EAGLE NEWS
IMG 20240724 WA0025

కుప్ప కూలి…

నేపాల్ రాజధాని ఖాట్మండు త్రి భవన్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్ కి చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో విమానం పడి పోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది సహా 19 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు…

Read More
tarun lavny

“అలా మొదలైంది”..సినిమా కాదు..!

హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో…

Read More
IMG 20240710 WA0013

ఎటిఎం మాయం…

ఏటీఎంలో దొంగతనం కోసం చొరబడ్డ దుండగులు ఏకంగా ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. 3.95 లక్షల నగదు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ నరేష్‌ పరిశీలించారు. కేవలం మూడు నిమిషాల్లోనే ఏటీఎంను ఎత్తుకెళ్లి నట్టు తెలుస్తోంది. ఎస్‌ఐ మోమన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారు జామున 3 గంటలా 20 నిమిషాల సమయంలో దొంగలు చాకచక్యంగా ఏటీఎంలోకి…

Read More
tg high court

కొట్టివేత…

వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన “వాన్‌పిక్” కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. జగన్ కంపెనీల్లో రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. క్విడ్ ప్రొ కోలో ఇదంతా భాగమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీబీఐ…

Read More
tarun c

“తిరగబడెను”సామీ…

తెలుగు సినీ నటులు హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితంలోను  సమస్యలు ఎదుర్కొంటున్నారు. తరుణ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి పదకుండు ఏళ్లుగా నమ్మిస్తున్నాడని, చివరకు మోసం చేశాడని లావణ్య అనే యువతి హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తరుణ్ తో 11 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నట్ట్టు పేర్కొంది. అంతేకాదు, ఇద్దరు గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది….

Read More
IMG 20240621 WA0041

అమ్మా “గూడెం”..!

మైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీ లాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ ఏక కాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే. సోదాలు పూర్తి కావడంతో ఈడీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రూ. 300 కోట్ల మేర…

Read More
gjrt fore

“డెత్ జోన్”..

గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేసవి సెలవు దినాలలో ఆడుకోవడానికి, సేద తిరడానికి సాయం కాల సమయంలో గేమ్ జోన్ లోకి ఉల్లాసంగా వెళ్ళిన చిన్నారులు, వారి తల్లి దండ్రులు అగ్ని కీలలలో బూడిదగా మారారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి నడుపుతున్న రాజ్‌కోట్ లోని టి. ఆర్. పి. గేమింగ్ జోన్‌ శనివారం “డెత్ జోన్” గా మారింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో 35 మంది వరకు సజీవ దహనం అయ్యారు. అనేక…

Read More
IMG 20240414 WA0007

ఏం జరుగుతోంది..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు…

Read More
IMG 20240318 WA0017

కేజ్రీవాల్ అరెస్ట్…

దేశ ప్రజలు అనుకున్నట్టే అయింది. దేశ రాజధాని ఢిల్లీ పై ఆధిపత్యం కోసం పడిగాపులుగాస్తున్న కేంద్ర అధికారగణం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రవాల్ ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో దూకుడు పెంచిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఎన్నికల సమయంలో అటు తెలంగాణ నుంచి కవితని అరెస్టు చేసి, ఇప్పుడు నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్టు చేసింది.

Read More
drug lishi

సస్పెన్స్….

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి ఎక్కడున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. కేసు వెలుగు చూసిన నాటి నుంచి ఈ నటి తెరవెనక్కి వెళ్ళిపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక, లిషి కనిపించడం లేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతుపట్టకుండా ఉంది.

Read More
krish

కనిపించని “కంచె”…!

హైదరాబాద్ రాడిసన్ హోటల్ లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీ కేసులో నిందితునిగా ఉన్న సినీ దర్శకులు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ డైరెక్టర్ కి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు కోర్టుకు సమాచారం ఇచ్చారు.ఆయన కోసం గలిస్తున్నట్టు పేర్కొన్నారు. క్రిష్ పలువురు అగ్ర నటులతో హిట్ సినిమాలు చేశారు. గమ్యం, వేదం, మాణీకర్ణిక, గౌతమి…

Read More
jayaprada3

అరెస్టుకు రంగం..

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ చేసింది. 2019 లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి ఆరు సార్లు జయప్రదకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా, విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో, ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 27న న్యాయస్థానం ముందు హాజరు…

Read More
city cps

కొత్త “సింహాలు”…

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మొదట జంట నగరాలకు ఉక్కు కవచాలను నియమించింది. హైదరాబాద్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించింది. అదేవిధంగా సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సిపి గా సుధీర్ బాబుని నియమించారు.ఇప్పటి వరకు నగర కమిషనర్ గా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.

Read More
flight c

కూలిన విమానం…

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో విమాన ప్రమాదం జరిగింది. పైలెట్ లకు శిక్షణ ఇచ్చే విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయి మంటలకు గురైంది. చిట్టడవిలో విమానం పూర్తిగా కాలిపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More