babu 11c

ఉప ప్రధానిగా చంద్రబాబు?

కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశ రాజకీయాలోనూ పెను మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు పిల్లర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితీష్ కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ బుక్ చేసుకున్నారు. ఇక మిగిలింది చంద్రబాబు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను కుమారుడు లోకేష్ కు అప్పజెప్పి, చంద్రబాబు ఏకంగా దేశ ఉప ప్రధాని పదవి పై కన్నేసినట్టు రాజకీయ చర్చలు గుప్పుమంటున్నాయి. తెర…

Read Full News
Operating theatre

వైద్యుల “అద్భుతం”..!

ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్యల బారీన పడి అవసాన దశలో ఉన్న (బ్రెయిన్‌డెడ్) వారి అవయవాలను మాత్రమే సేకరించి ఇతరుల ప్రాణాలను కాపాడేవారు. కానీ, ఇకపై సహజ మరణానికి గురైన వారి అవయవాలు సైతం సేకరించే అవకాశం ఉంది. ఈ చారిత్రక ఘట్టం మన దేశం లోనే ఆవిష్కృతమైంది. వైద్య రంగంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా, సహజంగా మరణించిన వ్యక్తి నుంచి వైద్యులు విజయవంతంగా అవయవాలను సేకరించారు. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి…

Read Full News
modi

ఇళ్లకు కేంద్రం పరిహారం

జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ – పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పాకిస్థాన్ సైన్యం దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు పరిహారం అందజేయనున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తూ 25 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సరిహద్దులో దెబ్బ తిన్న 2060 ఇళ్లకు ఈ పరిహారం ఇవ్వనున్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు లక్షరూపాయల చొప్పున బాధితులకు అందజేస్తారు.

Read Full News
del airport

కూలింది..

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద వర్షం కారణంగా పైకప్పు కొంత భాగం కూలి పోయింది. దీంతో ప్రయాణికులు భయంతో ఒక్పకసారిగా రుగులు తీశారు. ఆదివారం తెల్లవారుజామున వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. టెర్మినల్-1 వద్ద టెంట్ ఆకారంలోని రూఫ్‌లోకి వర్షపు నీరు చేరి అమాంతం కూలిపోయింది.

Read Full News
IMG 20250515 WA0034

కాలం మారుతోంది…!

దేశంలో రానున్న ఐదు రోజుల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ ,  సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ,  తమిళనాడులలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అండమాన్ నికోబర్ దీవులలోనూ  రాబోయే 5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం…

Read Full News
all party

“సిందూర్‌” ఆగదు…

మొన్న రాత్రి జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌లో 100 మంది పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి “ఆపరేషన్ సిందూర్” పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ లోని ల్రైబరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురునేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి…

Read Full News
download 10

సరిహద్దులు మూసివేత‌…

పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ “ఆప‌రేష‌న్ సింధూర్” పేరిట పాకిస్థాన్‌, దాని ఆక్రమిత కశ్మీర్‌లో క‌చ్చితమైన క్షిపణి దాడులు నిర్వ‌హించింది. దీంతో దాయాది దేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. పాక్‌ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్‌, పంజాబ్ అప్రమత్తమ‌య్యాయి. ఆయా రాష్ట్రాల‌లో హై అలర్ట్‌ ప్రక‌టించారు. సరిహద్దులను మూసి వేసి గస్తీని ముమ్మరం…

Read Full News
IMG 20250426 WA0006

వలలో నకిలీ పౌరులు..

కాశ్మీర్ లోయ పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలతో పాటు డీజీపీలకు అక్రమంగా భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానియులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఊహించిన…

Read Full News
IMG 20240912 WA0044

ఢిల్లీలో సంతోషం..

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ని కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి తో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇళ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పది కోట్ల రూపాయలు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం…

Read Full News
IMG 20240815 WA0035

ప్రపంచానికే స్ఫూర్తి…

భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.”హర్‌ ఘర్‌ తిరంగా” వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగు తున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని.. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందన్నారు. భారత్‌ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకమని.. శతాబ్దాల…

Read Full News
IMG 20240815 WA0031

హిందీ భాషను గుర్తించండి

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత రాయబార కార్యాలయం లో దౌత్యాధికారి రవీంద్రన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికార భాషగా గుర్తింపుకు చేయవలసిన ప్రయాత్నాలను గురించి చర్చించారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచి, ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, అరబిక్, స్పానిష్ ఆరు భాషలు మాత్రమే అధికార…

Read Full News
IMG 20240811 WA0020

కొట్టుకుపోయిన గేటు..!

కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా గొలుసు తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకి వస్తోంది. ఇటీవలి వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం వరద తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో 35…

Read Full News
IMG 20240802 WA0013

విలయానికి 310 మంది..

కేరళ లోని వయనాడ్ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది.. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 310 కి చేరుకుంది. మండక్కై, చూరాల్ మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సైన్యం వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించాయి….

Read Full News
IMG 20240730 WA0010

కబళించిన కొండలు…

పచ్చని రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా 90 మందికి పైగా మరణించినట్టు తెలుస్తుంది, వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనా స్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టి నట్లు అధికారులు తెలిపారు. మెప్పాడి ముండకై ప్రాంతం లో అర్థరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు…

Read Full News
IMG 20240725 WA0021

“కంగన”కు నోటీసులు

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మండి నియోజక వర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. మండి నుంచి పోటీ చేసేందుకు తాను సమర్పించిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు. కంగనాను అనర్హురాలిగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఆగస్టు 21లోగా సమాధానం చెప్పాలని కోర్టు నోటీసులు ఇచ్చింది.

Read Full News