క్షేమంగా రావాలి…

himachal 12

హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు డాక్టర్లు హిమాచల్ ప్రదేశ్ మనాలి లోని వరద ముంపు ప్రాంతంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్ వరదల్లో చిక్కుక్కున్నారు. ముగ్గురు డాక్టర్ల ఫోన్స్ స్విచ్చాఫ్ అయినట్లు సమాచారం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *