pawar c

ఇక పై “కోటి”…

తెలంగాణాలో విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ప్రజాభవన్ లో ఏర్కోపాటు చేసిన కార్యక్రమంలో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక పత్రం అందజేశారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును…

Read More
cv bakrid

బక్రీద్ వస్తోంది..

బక్రీద్ పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంలో శాంతియుత వాతావరణంలో, నగరాన్ని పరిశుభ్రంగా పెడుతూ జరుపుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్  సూచించారు. బక్రీద్ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, సరైన వెటర్నరీ సర్టిఫికెట్లు లేని, వధకు సిద్ధంగా లేని పశువులను అక్రమంగా తరలించడాన్ని నిరోధించడానికి హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, జీహెచ్‌ఎంసీ…

Read More
IMG 20250508 WA0010

కలిసి పోరాటం..

ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలతో ఉమ్మడిగా ఉద్యమం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు గాయంతో బాధపడుతున్న కేఎస్ఆర్ గౌడను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్, ఆ పార్టీ నేతలు రాజు, తివారీ ఈ రోజు హైదరాబాద్లోని మెట్టుగూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో కలిసి…

Read More
IMG 20250505 WA0014

“అసంఘటిత” దోపిడీ..

సమాజంలో ఆధునికంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అసంఘటిత కార్మిక రంగం విస్తరిస్తోందని, ఇదే సమయంలో కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ అన్నారు. వస్తు సేవల రంగం విస్తరణ, ఆన్లైన్ వ్యాపారం, ఇతర ప్రాంతాల నుంచి లేబర్ వలస వంటి కారణాల వల్ల అసంఘటిత కార్మికులు ఉపాధి సమస్యతో పాటు తక్కువ కూలీ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రానున్న కాలంలో అసంఘటిత కార్మికుల సమస్యలు తీవ్రం కానున్నాయని,…

Read More
IMG 20250427 WA0025

“గులాబీ” గరళం…

భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భారాస రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు.‘‘గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం….

Read More
IMG 20250427 WA0018

శత్రువు కాంగ్రెస్…

1969లో మూగ‌బోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ గుర్తు చేశారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌లు ప‌రిపాల‌న అప్ప‌గిస్తే విధ్వంస‌మైన తెలంగాణ‌ను వికాసం వైపు న‌డిపించా అన్నారు. కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆశ్ర‌య‌మిస్తే ఏప్రిల్ 27, 2001న జ‌ల‌ దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చ‌రిత్ర‌ను మలుపు తిప్పిన మ‌హోజ్వ‌ల‌ ఘ‌ట్టం. కులం, మ‌తం, ప‌ద‌వుల కోసం…

Read More
IMG 20250426 WA0024

“హర్షి” కళ..

బాచుపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని బరిగేలా హర్షిత శేఖర్ గౌడ్ చిత్ర కళ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన హర్షిత చక్కటి నైపుణ్యంతో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళకుగట్టినట్టు పెయింటింగ్ రూపంలో చూపడం విశేషం.

Read More
IMG 20250415 WA0005

రైల్ స్టేషన్ బంద్

కొత్త హంగులు, అత్యాధునిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముస్తాబు అవుతోంది. ఈ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేషన్ పరిధిలోని మొత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లను వంద రోజుల పాటు మూసి వేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో దాదాపు 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్ కాచిగూడ, నాంపల్లి, స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణం లో భాగంగా భారీ స్కై కాంకోర్స్ లిఫ్టులు ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌…

Read More
IMG 20250312 WA0044

19న తెలంగాణ బడ్జెట్..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 19న ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ…

Read More
IMG 20241028 WA0001

శుభాకాంక్షలు “సీనన్నా”..

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు.

Read More
IMG 20240925 WA0022

ఇవ్వొద్దు..కుదరదు…

హైదారాబాద్ లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించు కోవాలని బుధవారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి…

Read More
IMG 20240912 WA0019

ఈ ఏడాది షురూ..

ఆందోల్ నియోజకవర్గం జోగిపేట లోని నర్సింగ్ కళాశాల భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. నర్సింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం క్లాసులు నిర్వహించేలా భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో నర్సింగ్ కళాశాల క్లాసుల ప్రారంభంతో పాటు హాస్టల్ వసతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read More
IMG 20240913 WA0048

చేదోడు…

తెలంగాణలో వరద బాధితుల కోసం నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో బాలకృష్ణ కుమార్తె తేజస్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు.

Read More
IMG 20240913 WA0054

“ఔటర్”పై గణపతి…

గత పది సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రుల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ లో వివిధ టోల్ ప్లాజాలో సిబ్బంది అన్నదాన కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ నవరాత్రుల్లో సిబ్బంది టోల్ వసూళ్లతో పాటు స్వామి పూజా కార్యక్రమాలను నిష్టగా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఎగ్జిట్ 14 టోల్ ప్లాజా లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐఆర్బి కంపెనీ సిటిసి కృష్ణమూర్తి, సునీల్ సింగ్ ,అఖిల్ సింగ్, బబ్లు…

Read More
IMG 20240908 WA0036

సమాజానికి వైద్యులు…

పాత్రికేయులు సమాజానికి పట్టే చీడ కు చికిత్స చేసే వైద్యులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అంతటి బాధ్యత ఉన్న వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. హైదారాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ కి పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించిన స్వాధీన పత్రాలను రేవంత్ అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన…

Read More