IMG 20240904 WA0035

“బెస్ట్ మాస్టర్ “

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏటా ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ రావు స్థానం పొందారు. 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. ఆయన ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక యూనివర్సిటీ లో ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగానికి,…

Read More
IMG 20240828 WA0018

ప్రవేశాలు షురూ…

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ(యూజీ) బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో, పీజీ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్ఎస్ఐఎస్సీ, ఎంఎల్ఎస్సీ తదితర డిప్లొమా కోర్సుల్లో ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోగా ప్రవేశాలు పొందాలని హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దృశ్య శ్రవణ మాధ్యమం పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం డైరెక్టర్, డీన్ సామాజిక శాస్త్రం ఆచార్య శ్రీనివాస్ వడ్డాణం తెలిపారు. ఖమ్మంలోని ఎస్ అర్ అండ్ బి…

Read More
IMG 20240824 WA0016

“ఎన్”- నేలమట్టం…

“హైదారాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ” (హైడ్రా) దూకుడు పెంచింది. విమర్శలు, ఆరోపణల మధ్య తన పని తాను చేసుకుపోతోంది. మొన్న గండిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు, నేడు మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేశారు. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం కూల్చివేత చేపట్టింది. మూడున్నర ఎకరాల చెరువును ఆక్రమించి ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలు రావడం, విచారణలో వాస్తవమని తెలవడంతో…

Read More
IMG 20240819 WA0024

మీ సహకరం అజరామం..

హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని సీఎం తెలిపారు.గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి వారు నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం…

Read More
IMG 20240818 WA0005

ఇక జాతీయ స్థాయి పోరు

జై స్వరాజ్ పార్టీ, జై హింద్ నేషనల్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పని చేయాలని నిర్ణయించాయి. జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై హింద్ నేషనల్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ మిశ్రా హైదరాబాద్ లోని హైటెక్స్ లో సమావేశమై దేశ సమకాలీన సమస్యలు, పేదరికం, అభివృద్ధి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల ఆలోచన విధానం తదితర అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం జై స్వరాజ్ పార్టీ అధినేత…

Read More
IMG 20240815 WA0032

“స్కిల్” ఛైర్మన్…

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్ ఛైర్మన్ గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. అదేవిధంగా ప్రముఖ విద్యా వేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా, కో-చైర్మన్‌ హోదాలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరూ ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆనంద్ మహీంద్రా…

Read More
IMG 20240812 WA0032

మానవ అక్రమ రవాణా

అరేబియన్ ఎడారిలో సరైన వసతి, ఆహారం లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని తనను రక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి కొద్ది రోజుల కిందట రాథోడ్ నాందేవ్ అనే ఒంటెల కాపరి పంపిన వీడియో సంచలనం రేపింది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ ను కువైట్ లో ఇంటి పని (డొమెస్టిక్ హెల్పర్) వీసాపై తీసికెళ్ళి అక్రమంగా దేశ సరిహద్దులు దాటించి సౌదీ అరేబియా ఎడారిలో బలవంతంగా ఒంటెల కాపరిగా పనిచేయిస్తున్న విషయం…

Read More
IMG 20240808 WA0012

పోరాట చిహ్నం…

కార్మికుల సమస్యల పై పోరాడడానికి జై స్వరాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘం ఏర్పాటైంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ (జె.ఎస్.టి.యు.) లోగో ఆవిష్కృతమైంది. అసంఘటిత కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిన జేఎస్టీయూసీ కార్మిక లోకాన్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ శాఖల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపధ్యంలో జేఎస్టీయూసీ బైక్ స్టిక్కర్లను…

Read More
IMG 20240805 WA0001

ఒలింపిక్ “టీమ్”..

ప్యారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్-2024 ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారులు( క్రీడలు) జితేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్. వేణుగోపాల చారి, ఎం రవీందర్ రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. క్రీడాకారులకు నైతిక మద్దతు అందించడంతోపాటు క్రీడా స్టేడియాల సందర్శన, ఒలంపిక్స్ పోటీలకు చేసిన…

Read More
IMG 20240803 WA0012

ఇళ్ళు లేని “భవన నిర్మాతలు”

భవన నిర్మాణ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. పూరి గుడిసె నుంచి భారత పార్లమెంటు వరకు నిర్మించే ఈ వర్గానికి సొంత ఇల్లు లేక పోతే ఇక కాంగ్రెస్ ప్రజా పాలనకు అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదు మెట్టు గూడ లోని జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా కేఎస్ఆర్ గౌడ…

Read More
IMG 20240802 WA0040

‘గల్ఫ్ బోర్డు’ పెట్టండి..

గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ‘గల్ఫ్ బోర్డు’ ఏర్పాటు చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు స్పష్టమైన జీవో జారీ చేయాలని, ఎన్.ఆర్.ఐ. పాలసీ ని . ప్రవేశపెట్టాలని, రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం…

Read More
IMG 20240731 WA0037

కొత్త గవర్నర్….

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి…

Read More
IMG 20240726 WA0025

రచ్చ చేస్తే “రద్దు” చేస్తాం..

శాసనసభలో కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేక పోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. ‘‘గతంలో కొన్ని సంప్రదాయాలు నెలకొల్పారు. గతంలో నన్ను ఏ రోజూ అసెంబ్లీలో కూర్చో నివ్వలేదు. ప్రస్తుతం నా దగ్గరకు 10 మంది భారాస ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు….

Read More
IMG 20240730 WA0012

చరిత్ర లోనే రికార్డు

స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల…

Read More
IMG 20240728 WA0002

కొత్త గవర్నర్ “వర్మ”

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు.త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు.ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు.అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు.2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.కాగా తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌…

Read More