Screenshot 20241203 094717 WhatsApp

అలల మధ్యకు సరే.. అడవి బిడ్డలు మరి..!

గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక అండమాన్ అడవుల్లో బతుకుతున్నామా అనే సందేహం కలుగుతోంది. వందల, వేల కోట్ల రూపాయల లెక్కలతో గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుతానికి అడవి బిడ్డల గోడు పట్టకలోవడం విచారకరం. విశాఖ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటనే పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరుని ప్రశ్నిస్తోంది. వైట్ కాలర్ దొంగలను వెతకడానికి పడవలు వేసుకొని…

Read Full News
IMG 20240711 WA0026

“గ్లోబల్ హబ్”గా విశాఖ..

గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతోనే తమ హయాంలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు శ్రీకారం చుట్టామన్నారు. మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు, సిబ్బందితో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో వైద్య పరికాల కోసం మెడిటెక్…

Read Full News
IMG 20231028 WA0007 1

విశాఖలో వి.పి.,…

ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి జగ్ దిప్ ధన్ కర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఐ.ఎన్.ఎస్. డేగా ఎయిర్ బేస్ కి చేరుకున్న ఆయనకు అంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు.

Read Full News

దసరా నుంచి అక్కడే…

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన వ్యవస్థ ను వచ్చే దసరా నుంచే విశాఖకు మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. విశాఖకు కార్యాలయాల తరలింపునకు కేబినేట్ ఆమోదం తెలిపిందని, కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వివరించారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ నిర్ణయాలను సచివాలయ పబ్లిసిటీ సెల్ లో…

Read Full News
ayyanna

అయ్యన్న అరెస్టు…

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిటి బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుని శుక్రవారం విశాఖ పట్నం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విశాఖలో అరెస్ట్ చేశారు.

Read Full News
Screenshot 20230817 170851 WhatsApp

పోటెత్తిన “పోర్టు”…

విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్ కి పిలుపు నిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం  కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.  కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు…

Read Full News
pawan 1

జగన్ అడ్డాగా విశాఖ…

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రశాంతమైన నగరంగా ఉన్న విశాఖ పట్నం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డాగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి ప్రారంభమైన “వారాహి” మూడో విడత యాత్ర సందర్భంగా జగదంబా సెంటర్ లో ఆయన మాట్లాడారు. విశాఖ ప్రస్తుతం కబ్జాదారులు, రాబందుల చేతులోకి వెళ్లిందన్నారు. 150 మంది ఎమ్మెల్యేలతో నీ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర రాష్ట్రం ఏలుతున్నావని, ఐనా నీకు ఎవరూ భయపడరని ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి…

Read Full News
ka paul 1

విశాఖ నుంచి పోటీ…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏదో ఒక అంశాన్ని చర్చనీయాంశంచేస్తారు. వచ్చే ఎన్నికలలో విశాఖ పట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి హాజరైన అయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని పాల్ మండిపడ్డారు. విశాఖ స్థానికుదడిననీ, రానున్న రోజుల్లో ఇక్కడే నివాసం ఉంటానని చెప్పారు. అంతేకాక, రాబోయే ఎన్నికలలో విశాఖ…

Read Full News