ఉప్పల్ స్కైవాక్ …

sky way1

ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్మించిన ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్టును పురపాలక శాఖ మంత్రి కె.టి.అర్. లాంచనంగా ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బాటసారి భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ఎంతో దోహదపడుతుందన్నారు. తొలుత మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ శిలాఫలకాన్ని మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్కైవాక్ పైన హెచ్ఎండిఏ ఏర్పాటుచేసిన ఫోటో ప్రదర్శనను, స్కైవాక్ మోడల్ ను సందర్శించి వాటి వివరాలు మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *