అహం..పతనం.. అదే “సనాతనం”..!
అమ్ము కోవడం కోసం పార్టీలు పెట్టడం,పదవుల కోసం సిద్ధాంతాలు, లక్ష్యాలను తుంగలో తొక్కడం ఒకప్పటి ప్రజారాజ్యం, నేటి జనసేన పార్టీలకే సొంతం. రంగు పూసుకున్న మొహాలు చూసే ప్రేక్షకులు తమను నాయకులుగా ఎన్నుకుంటారనే అత్యాశతో రాజకీయ పార్టీలు పెట్టడం పారిపోయింది. తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. అంతేకాదు, ఆ నాయకుల నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల కూడా వాళ్లను వెండితెర నుంచి జనంలోకి నడిపించాయి. పార్టీ సిద్ధాంతాలను వాళ్ళు ఎన్నడూ విస్మరించలేదు,…
