“మరాఠా”లో మహిళ సిఎస్

IMG 20240701 WA0012

మహారాష్ట్ర ప్రధాన కార్య దర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారిని సుజాతా సౌనిక్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్ కి చెందిన ఈమె హెల్త్కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో సిఎస్ గా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *