ఇళ్లకు కేంద్రం పరిహారం

modi

జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ – పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పాకిస్థాన్ సైన్యం దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు పరిహారం అందజేయనున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తూ 25 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సరిహద్దులో దెబ్బ తిన్న 2060 ఇళ్లకు ఈ పరిహారం ఇవ్వనున్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు లక్షరూపాయల చొప్పున బాధితులకు అందజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *