పిటిషన్ కొట్టివేత..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కు ఈ రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన పై విచారణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేత్రుతవంలోని ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.