IMG 20240725 WA0021

“కంగన”కు నోటీసులు

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మండి నియోజక వర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. మండి నుంచి పోటీ చేసేందుకు తాను సమర్పించిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు. కంగనాను అనర్హురాలిగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఆగస్టు 21లోగా సమాధానం చెప్పాలని కోర్టు నోటీసులు ఇచ్చింది.

Read More