
సరిహద్దులు మూసివేత…
పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరిట పాకిస్థాన్, దాని ఆక్రమిత కశ్మీర్లో కచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించింది. దీంతో దాయాది దేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసి వేసి గస్తీని ముమ్మరం…