కంగ్రాట్స్ జ్యోతి…
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించారు. ఈ పోటిలో బంగారు పతకం సాధించన తొలి భారత అథ్లెట్ గా నిలిచారు. ఎన్నో ఆశలతో మొదటిసారి ఆసియా అథ్లెటిక్స్ బరిలో దిగిన జ్యోతి అంతర్జాతీయ వేదిక పై అపురూప ప్రదర్శన చేసింది. 23 ఏళ్ల ఈ విశాఖ స్ప్రింటర్ ఫైనల్ పోటిలో 13.09 సెకన్ల లో సాక్ష్యాన్ని చేధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.