ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ఆధ్వర్యంలో జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 34 మంది వర్ధమాన బ్యాట్మెంటన్ క్రీడాకారులకు నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెమెంటులను అందజేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని జ్వాలా గుత్తా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.