ఆ నియామకాలు ఏంటి…

tspsc 1

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021 మే 19న జారీ చేసిన 108 జీవో ను తిరిగి సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఆరుగురు టీఎస్పీఎస్సీ లోని లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్ ల నియామకాలపై జారీ చేసిన ఉత్తర్వులను  పునపరిశీలించాలని సూచించింది.  కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి పిల్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. ఈ ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలను తాజాగా పరిశీలించాలని, మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు ఆరుగురు సభ్యులకు  అర్హతలు లేవని పిటిషనర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *