అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!
రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 ని ఆధారం చేసుకొని నీతు చెప్పడం కాదు, ప్రజా వేదికలపై మాట్లాడే సమయంలో ఎలా ప్రవర్తించాలనేది కూడా ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాలకంటే, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. నైతిక బాధ్యత అంటే అదీ. హక్కుల విలువ ఇవ్వడం అంటే అదీ. అంతేగానీ, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు కావాలి, ఎదుటి వాడు ఏది చెప్పినా అదీ మనకు అనుకూలంగా ఉండాలనే ఆలోచన పరమ దుర్మార్గం. ప్రజా ప్రతినిధిగా ఎన్నికై, బాధ్యత గల హోదాలో…
