
చంద్రబాబుకి బెయిల్
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ సంస్థ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈనెల 28న మధ్యంతర బెయిల్ ముగిసినా గానీ చంద్రబాబు ఇక రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కానీ, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని హైకోర్టు సూచించింది. స్కిల్ డెవలప్మెంట్…