IMG 20240527 WA0030

కొత్త “గుర్తు” కోసం…

తెలంగాణా రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. చిహ్నం మార్పు పై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ లో సోమవారం పలు నమూనాలను రేవంత్‌ పరిశీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు కసరత్తు చేస్తోంది. ఆ రోజు కొత్త చిహ్నం ప్రకటించే అవకాశం ఉంది.

Read More
IMG 20240527 WA0029

ఏర్పాట్ల “పరేడ్”…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌడ్స్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభాప్రాంగణం లో ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, సభాప్రాంగణంలో విధ్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, ఎల్ ఇ డి స్ర్కీన్ ల ఏర్పాట్ల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు….

Read More