ఎక్కడ కృష్ణా….

ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంతో జరిగిన దొంగతనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంతున్న ఎస్సై కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముషీరాబాద్ పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఆశీర్వాదం, శ్రీశైలం, సురేందర్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కానీ A2 నిందితునిగా ఉన్న ఎస్సై కృష్ణ ఆచూకి తెలియకపోవడం పట్ల విచారణ తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా ఎస్సై కృష్ణను అరెస్టు చేయకపోవడం ఆరోపణలకుఫ్ దరితిస్తోంది. సెటిల్మెంట్లలో కృష్ణ రెండవ భార్య ప్రధాన పాత్ర వహిస్తున్నట్టు పోలీసులకు అందిన సమాచారం. ఇప్పటికే కృష్ణకు సంబంధించిన అకౌంట్ లను సీజ్ చేసిన అధికారులు ఆయనను ఎందుకు అరెస్టు చేయడంలేనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొందరు ఉన్నతాధికారులు ఎస్సై కృష్ణ ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఘాటైన ఆరోపణలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *