కంకి రుచి..

kavita c
kavita kande

జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళా దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. రుచిని ఆస్వాధిస్తూ ఆమె వివరాలు సేకరించారు. కంకులు విక్రయించే మహిళ తన పేరు కొమురమ్మ అని తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ పాలన గురించి వివరించింది. ఇంటింటికి పించన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని కొమురమ్మ పేర్కొంది. స్వయంగా కేసీఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న తింటూ మాట్లాడటంపై కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అదే సమయంలో కొందరు వాహనాలు నిలిపి కవితతో సేల్ఫిలు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *