ఆహా.. ఏమి రుచి…!

sea food

భారత దేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 సంవత్సరంలో భారీ పెరుగుదల కనిపించింది. సముద్ర చేపలు, రొయ్యల ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి. స్వామి తెలిపారు. 2022-23లో రూ. 63,969.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023-24లో రూ. 60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయని వివరించారు. భారత్ లోని వివిధ సముద్రాల నుంచి జాలర్లు పట్టుకువస్తున్న సముద్ర ఉత్పత్తులకు భవిష్యత్తులో మరింత గిరాకీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *