జగన్ తో భేటీ…
ఎన్సీసీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.ఎం.రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
ఎన్సీసీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.ఎం.రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
సినీ నటి జయసుధ భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీ చేరారు.
హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించే అంశాన్ని చర్చించడానికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అయినట్టు తెసిసింది. ఈ సమావేశంలో పెండింగులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత, కొత్త వారికి స్థలాల సేకరణ వంటి ప్రధాన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
లంచాలకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం అండదండలతో భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్నాడు ఓ నకిలీ స్వామీజీ. అటు అటవీ శాఖ, ఇటు పంచాయితీ రాజ్ శాఖల అలసత్వం వల్ల ప్రభుత్వ స్థలాన్నే ఆక్రమించి పూటకో వేషంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ “కొత్త దేవుడు” సుమారు పాతికేళ్ళుగా బహిరంగ అక్రమానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అంతుపట్టని వ్యవహారం. ఇదంతా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులోని “రామదూత” ఆశ్రమంలో చోటుచేసుకున్నభాగోతం. జాతీయ రహదారి పక్కనే కోట్లాది…
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వాతావరణ సంక్షోభం యొక్క ఆవశ్యకతను గుర్తించి, భవిష్యత్ తరాలకు మన గ్రహం యొక్క రక్షణ పట్ల అవగాహనను పెంచేందుకు చేపట్టే సామూహిక కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు. ‘ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్’ బృందం రాష్ట్రపతిని కలిసి తాము చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా పర్యావరణ పరిరక్షణకు సానుకూలంగా ఉండడం,…
వరంగల్ , హన్మకొండ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పరిశీలించారు. జవహర్ నగర్, నయీమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్ ప్రాంతాలను పర్యటించి అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో“ రెడ్ క్రాస్ సొసైటీ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ హన్మకొండ ప్రాంతాలలో…
హబ్సిగూడ అన్ లిమిటెడ్ షో రూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, షో రూమ్ నుంచి భారీ గా మంటలు, పొగలు ఎగసిపడుతున్నాయి. ఉప్పల్ – సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకం కలిగింది.అన్ లిమిటెడ్ షో రూమ్ పెట్రోల్ బంక్ స్థలానికి అనుకొని ఉండడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి…
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ తిరుమల తిరుపతి దేవస్థానంఎక్స్-అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వేదపండితులు తీర్థ ప్రసాదాలు ,వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం కరికాలవలవన్ మీడియాతో మాట్లాడుతూ . తనకు ఈ అవకాశం కల్పించిన వేంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో భక్తులకు ఇప్పటికే మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు,…
తిరుమల శ్రీవారి ఆలయంలో అధిక మాసం శ్రావణ పౌర్ణమి గరుడ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వేంకటేశుని వేదం పండితులు పవిత్ర మంత్రోచ్చారనలతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
దేశంలో రాజకీయ మార్పు కోసం భారత రాష్ట్ర సమితి పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే విపక్షాల “ఇండియా”లతో గానీ, అధికార కూటమి “ఎన్ డీ ఏ” తో గానీ చేతులు కలిపేదే లేదన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పర్యటనకు వెళ్ళిన కెసిఆర్ వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాము ఎవరి వైపు లేమని, ఉండబోమని తెల్సిచేప్పారు. కానీ, తాము ఒంటరిగా మాత్రం లేమని …
రాష్ట్రంలో ఇటివల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వరంగల్,హన్మకొండ జిల్లాల్లో పర్యటించింది. ఏడుగురు సభ్యుల ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర బృందం హైదరాబాద్ నుండి నేరుగా హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టం పై ఏర్పాటు హన్మకొండ, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను…
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలను ఆమోదించింది. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటిఅర్ అధ్వర్యంలో పలువురు మంత్రులు విలేకర్లకు వివరించారు. రాష్ట్రంలో వదలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల అనుహ్యరీతిలో వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డవారికి రాష్ట్ర…
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ జర్నలిస్టుల పట్ల ఎందుకు ద్వంధ వైఖరిని అవలంభిస్తోంది. లక్షల రూపాయలు ధార పోసి కొనుగోలు చేసి, కొందరు అసూయపరుల మూలంగా పదిహేను ఏళ్లకు పైగా కోర్టులో నలిగి సాధించుకున్న భూములను జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడానికి ప్రభుత్వం నాన్చుడు ధోరణి ఎందుకు అవలంభిస్తోందో అంతుపట్టడం లేదు. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో ఎకరం భూమిని జర్నలిస్టులకు అప్పజెప్పడానికి అంగీకరించిన మంత్రి వర్గానికి పేట్ బషీరాబాద్…
రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం “ఛలో రాజ్ భవన్ ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు సమావేలో రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు లు మాట్లడుతూ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ విద్యకు నష్టం చేసి ప్రైవేట్, కార్పోరేట్…
తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వ్యుహాలకు కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రానికి చెందినా ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోంది. మొన్న బండి సంజయ్ అమిత్ షా ని కలవడం, ఆతర్వాత ఆయనను పార్టీ జాతీయ కార్యదర్శిగా ప్రకటించడం, కిషన్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ చేరికపై మంతనాలు చేయడం కనిపిస్తోంది. తాజాగా బిజెపి తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఢిల్లీలోని తెలంగాణ ఎలక్షన్ ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్…