exclusive

అటవీ భూమిలో “రామదూత”…!

లంచాలకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం అండదండలతో భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్నాడు ఓ నకిలీ స్వామీజీ. అటు అటవీ శాఖ, ఇటు పంచాయితీ రాజ్ శాఖల అలసత్వం వల్ల ప్రభుత్వ స్థలాన్నే ఆక్రమించి పూటకో వేషంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ “కొత్త దేవుడు”  సుమారు పాతికేళ్ళుగా బహిరంగ అక్రమానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అంతుపట్టని వ్యవహారం. ఇదంతా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులోని “రామదూత” ఆశ్రమంలో చోటుచేసుకున్నభాగోతం. జాతీయ రహదారి పక్కనే కోట్లాది…

Read Full News
pres acadmy

“పెద్దసారు”కోసం…

తెలంగాణ మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో నాంపల్లి లోని పాత ప్రెస్ అకాడమీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక…

Read Full News
Screenshot 2023 08 05 083323

లాల్ సలాం…

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు )ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ, దక్షిణ్ బస్తర్ డివిజన్ కమిటీ సంయుక్త విడుదల చేసింది. దండకారణ్యం -తెలంగాణ సరిహద్దుల్లో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు వాయిద్యాల మధ్య పాటలు పాడుతూ ఊరేగింపు చేశారు. నృత్యాలతో దండకారణ్య ప్రాంతాన్ని హోరెత్తించారు. అనంతరం ఇటీవల అమరుడైన కటకం సుదర్శన్ స్థూపాన్ని ఆవిష్కరించారు. అమరుల ఆశయాలను కొనసాగిస్తామని మావోయిస్టు నేతలు స్పష్టం చేశారు. 

Read Full News
dimond

ఘనంగా చేస్తాం…

75 ఏళ్ల దేశ స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వెడుకల్లో ప్రజా ప్రతినిదులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు…

Read Full News
rahul 10

అగ్రనేతకు ఊరట..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన మంత్రి మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సరైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చింది. పరువు నష్టం కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్‌ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దీంతో రాహుల్‌ గాంధీకి ఊరట లభించినట్టయింది. దిగువ కోర్టులు అభియోగ పత్రాల సంఖ్య చూశాయే గానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ తరఫున వాదనలు…

Read Full News
Screenshot 2023 08 04 133649

వాణ్ణీ అలాగే చేయండి…

మహారాష్ట్ర లోని థానేలో ఉన్న బందోడ్కర్ కాలేజీలోని మహా దారుణం జరిగింది. ఆ కాలేజిలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి. శిక్షణలో జూనియర్లను ఓ సీనియర్ విచక్షణ రహితంగా కొట్టడం వివాదంగా మారింది. బందోడ్కర్ కాలేజీలో జూనియర్ లు తన మాట వినలేదని వారిని వర్షపు నీటిలో వంచి కర్రతో గొడ్డును బాదినట్టు చితకబాదాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ సుచిత్ర నాయక్  చేతులు దులుపుకున్నారు. అయితే, పాశవికంగా కొట్టిన…

Read Full News
ktr j

ఇదా సమాధానం…

హైదరాబాద్ లో ఏంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళ స్థాసాలు మంజూరు చేయాలని శాసన సభలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. జంట నగరాల్లో అనేక మంది జర్నలిస్టులు సుప్రీం కోర్టులో కేసు నెగ్గి కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. శాసన సభ జీరో అవర్ లో జగ్గారెడ్డి ఈ మేరకు ప్రస్తావించారు. అయితే , దీనికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ఇచ్చిన సమాధానం…

Read Full News
ranga asha

సెంట్రల్ లో “రంగా” కూతురు…!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి కరమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే క్రమంలో పురదేశ్వరిని ఆ రాష్ట్ర బిజెపి శాఖకు అధ్యక్షురాలిగా చేయడం, చంద్రబాబు నాయుడు మాత్రం తన పంజాలో అధికార పార్టీని ఎండగడుతూ లోకేష్ ని రోడ్ షోలకు పంపి రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెజవాడ  రాజకీయలు కేంద్ర బిందువుగా మారుతాయి….

Read Full News
ka paul 1

విశాఖ నుంచి పోటీ…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏదో ఒక అంశాన్ని చర్చనీయాంశంచేస్తారు. వచ్చే ఎన్నికలలో విశాఖ పట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి హాజరైన అయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని పాల్ మండిపడ్డారు. విశాఖ స్థానికుదడిననీ, రానున్న రోజుల్లో ఇక్కడే నివాసం ఉంటానని చెప్పారు. అంతేకాక, రాబోయే ఎన్నికలలో విశాఖ…

Read Full News
central team in

నష్టం జరిగింది…

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమైంది. ఈ నెల ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్…

Read Full News
pay c

గుడ్ న్యూస్ వస్తోంది…

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి కొద్దిరోజుల్లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ తో శాసన సభ లో సమావేశం అయ్యారు. ఉద్యోగుల వేతనల పెంపు, కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీవో నేతలు మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే పీఆర్సీతో పాటు ఐఆర్ కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని కూడా…

Read Full News
contempt 1 1

అటు విజ్ఞప్తి…ఇటు ఆందోళన..

తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుతూ డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఈ రోజు శాసన సభలో పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ని వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి జర్నలిస్టులకు తప్పని సారి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించనున్నట్టు తెలుపారు. ఇదిలా ఉంటే, తమకు న్యాయంగా దక్కాల్సిన భూముల విషయంలో ప్రభుత్వం అవలభిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల జవహర్ లాల్…

Read Full News
jagan.air

జగన్ తో భేటీ…

ఎన్‌సీసీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ వి.ఎం.రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

Read Full News
jayasudha join c

తీర్ధం…

సినీ నటి  జ‌య‌సుధ భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో త‌రుణ్ చుగ్‌, కిష‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆమె బీజేపీ చేరారు.

Read Full News
ktr

ఇళ్ల స్థలాల చర్చలు…

హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించే అంశాన్ని చర్చించడానికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అయినట్టు తెసిసింది. ఈ సమావేశంలో పెండింగులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత, కొత్త వారికి స్థలాల సేకరణ వంటి ప్రధాన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read Full News