దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, వాళ్ళను తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా కాదంటే ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష తప్పవని అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తి పరంగా ఎలాంటి భయాందోళన లకు గురి కాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు తీర్పును ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల నుంచి రక్షణ ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.