priya police

నారాయణ వదలట్లే..

ఆంధ్రప్రదేశ్ మాజీ  మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత  నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం వేధిస్తూ,  బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ పొంగూరు కృష్ణప్రియ పోలీసులను ఆశ్రయించింది. నారాయణ డేగ మాదిరిగా  వెంబడించి నానా రకాల హింసలకు గురిచేశాడని ప్రియ బహిరంగ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణ  తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తన గోడు వెల్లబుచ్చుకుంది. ఇంట్లో ఎదుర్కొంటున్న నారాయణ వేదింపులపై  వీడియో విడదుల చేసిన తరువాత నారాయణ నుంచి వేధింపులు…

Read Full News
Screenshot 2023 07 30 114523

ఇప్పుడు బిజెపి వైపు…

ప్రముఖ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి  రానున్నారు.  ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే  సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని జయసుధ కలవడంతో ఈ ఉహగానలకు తెరలేచింది. ఇద్దరూ సుమారు గంటకు పైగా సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరేందుకు రెండు, మూడు  రోజుల్లో న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువ మంది…

Read Full News
jnj c 2

ఈ జాగా మాదే…

దాదాపు 16 ఏళ్ల తీరని కల. 2007 లో అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూములపై కొండంత ఆశ. ఎప్పటికైనా దక్కకపోతుందా అనే గట్టి నమ్మకం. సుధీర్ఘ ఎదురుచూపులు. చివరకు హైదరాబాద్ విలేకర్లకు ఇళ్ళ స్థలాలు ఇవల్సిందే అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తమ సమస్య పరిష్కారం అయినట్టే అన్న నిట్టూర్పు. కానీ “సుప్రీం” తీర్పు ఇచ్చి ఏడాది గడుస్తున్నా అతీ గతీ లేదు. విన్నపాలు, పోరాటాలను పట్టించుకున్న నాధుడే లేడు. ప్రభుత్వం ఎవరికో మేలు…

Read Full News
jnj 3 2

ఎవరేంటో తేలాలి…

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ విలేకర్లు డబ్బు చెల్లించి మరీ ఎదురుచూస్తున్న ఇళ్ళ స్థలాలకు పరిష్కారం దొరుకుతుందా.. ఎంత పోరాటం చేసినా , దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం, అధికారులు ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు…దీని వెనుక ఎవరున్నారు ….అసలు జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఏం చేస్తోంది… అది ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతోందా… కమిటీ నాయకులలోనే కొందరు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారా, ఒత్తిడి తేలేక పోతున్నారా …జర్నలిస్టుల సదాక బాధకాలు చూడాల్సిన మీడియా అకాడమీ కూడా…

Read Full News
bhadra c

టెన్షన్..టెన్షన్ …

కుండపోత వర్షాలతో వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. ఈ  చెరువు గండిపడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న  పోతననగర్, సరస్వతినగర్ కు ప్రమాదం పొంచి ఉంది. సమాచారం అందుకున్న మున్సిపల్, ఎన్.డి.ఆర్.ఎఫ్. అధికారులు హుటహుటిన గండి పడ్డ ప్రాంతానికి చేరుకున్నారు. నివాస గృహాలవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నరు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి,  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా  గండి ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Read Full News
Screenshot 2023 07 29 090004

మా బావ మహా ముదురు…

ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత , ఆ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణపై అతని సొంత మరదలు తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ్ముని భార్యని అని కూడా చూడకుండా తనపై డేగ మాదిరిగా నారాయణ కన్ను వేశాడని, నానా రకాలుగా వేధించాడని అతని మరదలు పొంగూర్ ప్రియ ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం…

Read Full News
bheem c

దళితుల “ప్రగతి” భేష్…

దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుండి ఆత్మ గౌరవం దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని, ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని  భీమ్ ఆర్మీ  చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. హైదరాబాద్ పర్యటన సందర్బంగా  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి…

Read Full News
cs shanti 1

ఇక ఆరోగ్యంపై దృష్టి…

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గు ముఖం పట్టినందున వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల తాకిడికి గురైన జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రతల పై ఆమె జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరద…

Read Full News
godavari in 2

కదలలేక..మెదల లేక…

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.హైదరాబాద్, విజయవాడ 65 వ నెంబర్ జాతీయ రహదారిపై  వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా కీసర టోల్ గేటు సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి అధికం కావడంతో  ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. హైద్రాబాద్ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ,హుజూర్ నగర్,మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. కోదాడ – హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల…

Read Full News
exclusive 1

“కోడికత్తి” కేసు… ఎవరు దోషి…!

ఆ కేసు వెనుక ఎవరున్నారో ఎవరికీ తెలియదు. నేరం కావాలని చేశాడో, చేయించారో అనేది ఒక రహస్యం. రాజకీయం చేసే వారికి అది చాల పెద్ద కేసు. సామాన్యుని దృష్టిలో మాత్రం ఆ కేసు ఓ రాజకీయం. కేసుని శోధిస్తున్నది మాత్రం దేశ అత్యున్నత సంస్థ ఐన జాతీయ పరిశోధన సంస్థ, అదే ఎన్.ఐ.ఎ.. రాటుదేలిన నేరస్థుల నుంచి నిజాలు, వాస్తవాలు రాబట్టే అధికార యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకున్న బలమైన సంస్థ ఈ ఎన్.ఐ.ఎ…

Read Full News
Screenshot 20230727 203032 WhatsApp

వాగు దాటపోయి…

వరద నీటితో ప్రవహిస్తున్న వాగుని బైక్ పై దాటుతూ అదుపుతప్పి వాగులో కొట్టుకు పోయాడు ఓ వ్యక్తి. వరంగల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కన్నారం గ్రామానికి గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి బైక్ వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి కొట్టుకుపోయాడు. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో గాలిస్తున్నారు.

Read Full News
IMG 20230727 WA0043

బీబీ కా ఆలం…

శనివారం జరిగే మొహరం పండుగకు సంబంధించి ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ పరిశీలించారు. పాత బస్తీ దార్ ఉల్ షిఫా లోని బీబీ కా ఆలం వద్ద ఏర్పాట్లను పరిశీలించి దట్టీ సమర్పించారు. అనంతరం శనివారం బీబీ కా ఆలం ఉరేగింపు జరిగే ప్రాంతాలలో పర్యటించారు.

Read Full News
Screenshot 2023 07 27 191517

చికాగో వీదుల్లో…

హైదరాబాద్ నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన ఓ యువతి నానా ఇబ్బందులు పడుతోంది. ఉన్నత విద్య కోసం వెళ్ళిందా లేక ఉద్యోగం కోసం వెళ్ళిందా అనే విషయం కచ్చితంగా తెలియకున్నా చికాగో నగరంలో ఆమె రోడ్ల పైనే జీవనం సాగిస్తోంది. ఆమె వివరాలు కూడా పూర్తిగా చెప్పలేక్పోతోంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమచారాన్ని బట్టి ఆమె నగరంలోని మౌలాలి ప్రాంతానికి చెందిన యువతిగా తెలుస్తోంది. విషయం తెలిసిన ఆమె తల్లి విదేశాంగ మంత్రి జై…

Read Full News
pawan 16

ఆదుకోండి…

తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.   రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40…

Read Full News
amishaa

హైదరాబాద్‌ కు అమిత్ షా…

 బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకొని 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ…

Read Full News