“ఈగల్ “ఎఫెక్ట్ ….
తెలంగాణాలో ఎన్నికల అనంతరం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) వ్యవహార తీరు పై “తగ్గని ఒంటెద్దు దూకుడు…” అనే శీర్షికన “ఈగల్” న్యూస్ పోస్ట్ చేసిన కథనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశ మైంది. ఎన్నికల్లో ఓటమికి ప్రజలే కారకులు అన్నట్టు బి.ఆర్.ఎస్. నేతలు మాట్లాడడం సమంజసం కాదని “ఈగల్” చేసిన సూచన పై పార్టీ ఉన్నత స్థాయి నేతల్లోనూ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు…