telangana - EAGLE NEWS
smita c

“Net Smith”

Smita Sabharwal… There is no social “mediator” who doesn’t know this name and her pictures. Her posting is an attraction on social media. For the past seven to eight years, she has many likes and followers on social media from the Telangana state stage… her Tweets and Instagram accounts are seen in the form of…

Read More
skill scaled

300 కోట్లతో నైపుణ్య అభివృద్ధి

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే “ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ ఎఫ్)”, టెక్సస్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్ వే’ సంస్థల ప్రతినిధులతో మంగళవారం నాడు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా స్టార్టప్ లను…

Read More
Screenshot 20240716 143437 WhatsApp

అంతుపట్టని ఆవేశం

తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులు అనేక ఏళ్లుగా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తుంటే చేతికి వచ్చే అవకాశాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గపు చర్యలే. ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రంలో సరైన అవకాశాలు లేక, ఉన్నా ఇబ్బడిముబ్బడిగా ఉన్న పోటీని తట్టుకోలేక తెలంగాణ బిడ్డలు నానా గోస అనుభవించారు. “మా చదువులు మావే అని, మా ఉద్యోగాలు మాకే సొంతం” అంటూ గంపెడు కోరికల మధ్య పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో మొన్నటి వరకు వారికి ఎంత…

Read More
IMG 20240711 WA0008

తెలంగాణాలో “మైక్రోలింక్”

అమెరికా టెలికమ్మూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రల క్లస్టర్ ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం నాడు మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి ‘పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు….

Read More
tarun lavny

“అలా మొదలైంది”..సినిమా కాదు..!

హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో…

Read More
IMG 20240711 WA0000

తెలంగాణ మైనింగ్ సెంట‌ర్

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివ‌ర్సిటీ – ఐఐటీ హైద‌రాబాద్ ఐఐటీ స‌హ‌మాకారంతో మైనింగ్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మాకారం అందిస్తుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. ఈ రోజు డాక్ట‌ర్ బీఆర్ ఆంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో భ‌ట్టి విక్ర‌మార్క‌తో ఐఐటీ హైద‌రాబాద్ కు చెందిన ప్రొఫెస‌ర్ మూర్తి, ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెస‌ర్ ఎలిశెట్టి మోహ‌న్ లు ప్రత్యేకంగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా బ్యాట‌రీల‌లో…

Read More
IMG 20240709 WA0049

Reviewed on irrigation..

CM Revanth Reddy and Irrigation Minister Uttam Kumar Reddy reviewed the present status of all ongoing irrigation projects in Combined Mahaboobnagar district with department officials and elected representatives. It was decided to expedite construction and completion of Kalwakurthy , Nettampadu, Bhima , Koil Sagar, Kodangal and Palamuru Ranga Reddy lift irrigation schemes.

Read More
eye c

పొంచివున్న “రెండు కళ్లు”…!

రాజకీయ చాణక్యం, జగన్ పాలనలో లోపాలను వెలుగెత్తిచాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థితిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వైభవం అక్కడ ఒక వెలుగు వెలుగుతోందనడంలో సందేహం లేదు. కానీ, చంద్రబాబు అమితంగా ఇష్టపడే హైదరాబాద్ పై ఆయన మమకారం చెక్కుచెదరనట్టు కనిపిస్తోంది. ఛత్రపతి” సినిమాలో “ఒక్క అడుగు” అనే డైలాగు మాదిరిగా, ముఖ్యమంత్రి హోదాలో…

Read More
bonal 24

ఆషాఢ “బోనం”..

ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికున్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని , పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని. బోనాల పండుగను పురస్కరించుకుని సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ సృష్టి కొనసాగింపుకు మూలమైన మహిళలు సదా ఆరాధనీయులనే సందేశాన్నిస్తుందని మంత్రి అన్నారు.  ప్రకృతిని తల్లిగా భావిస్తూ, బోనాలతో అమ్మవార్లకు పండుగ చేసే…

Read More
IMG 20240706 WA0053 1 scaled

తొలి అడుగు..కమిటీలు…

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలను భట్టి వివరించారు.రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో…

Read More
IMG 20240705 WA0045

కొలిక్కి వచ్చే భేటీ…

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి ప్రజా భవన్‌ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుందనేది ఆసక్తికరంగా మారింది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వీరిద్దరూ భేటీ కావటం ఇదే తొలిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్తు సంస్థలకు…

Read More
IMG 20240704 WA0014

ఒకేరోజు ఇద్దరు…

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే రోజు దేశ రాజధానిలో ఢిల్లీలో సందడి చేశారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు పలురకాల చర్చల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విడివిడిగా కలిశారు. రానున్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి మేలు జరిగేలా చూడాలని, రాష్ట్ర అభివృద్ది కోసం ఆర్ధిక సాయం చేయాలనే ప్రధాన అంశాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలురకాల అభివృద్ది పథకాలకు చేయూత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మోడీకి…

Read More
IMG 20240703 WA0052

“భేటీ” కోసం..

ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రజా భవన్ లో భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లును తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు….

Read More
IMG 20240703 WA0007

Strengthen Anti-drug measures

A.Revanth Reddy, Chief Minister of Telangana held an Interactive Session with Inspectors and above rank Police Officers of the Tri Commissionerates of Hyderabad, Cyberabad and Rachakonda, at the TGC and CC Auditorium, Banjara Hills, Hyderabad. Revanth mentioned that the public is never satisfied with the work turned out by politicians, Police and Press. He appreciated…

Read More
batti houses c scaled

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు “సోలార్”

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించి త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి ఈ ఏడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్ల చొప్పున‌ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింద‌న్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేసే ఆరు గ్యారంటీల అమ‌లులో భాగ‌మే ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణమ‌న్నారు. హైదరాబాద్ లోని డాక్ట‌ర్ బిఆర్…

Read More