tg high court

ఫలితాలు ఆపండి…

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే సోమవారం వరకు ప్రకటించ వద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు సర్వీసు కమిషన్ కు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని టీ ఎస్ పి ఎస్ సికి సూచించింది. తమ వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు కమిషన్ గడువు కోరగా అయితే…

Read Full News
praneeti

కృత్రిమ గర్భానికి ఎ.ఐ…!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఎ.ఐ.) ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమవుతుందని సినీ నటి ప్రణీత అన్నారు. సికింద్రాబాద్ లోని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ మాతృత్వం ఒక వరమని, మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తి పరమైన ఒత్తిడి పెరిగడం వల్ల సంతాన లేమి…

Read Full News
Screenshot 2023 07 25 154029

మై హోమ్.. ఐదుగురు మృతి…

మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ కంపెనీ విస్తరణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పని చేస్తుండగా లిఫ్ట్ కూలి కింద పడడంతో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందినట్టు సమాచారం అందింది. గాయపడ్ద వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read Full News
vanama

“వనమా”ఎన్నిక చెల్లదు….

ఎన్నికలు సమీపించే సమయంలో సీనియర్ లీడర్ వనమా వెంకటేశ్వరరావు కి గట్టి డెబ్భ తగిలింది. గత ఎన్నికల్లో అయన గెలుపు చెల్లకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల చెల్లదంటూ తీర్పు హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల సమయంలో తప్పుడు ధృవపత్రాలతో అఫీడవిట్ సమర్ఫించారని వనమా పై ఆ ఎన్నికల్లో ప్రత్యర్ధి , మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోర్టులో అనర్హత పిటీషన్…

Read Full News
iith c

నైపుణ్యం కోసం మార్పులు…

విద్యార్ధుల్లో  నైపుణ్యాన్ని వెలికి తీయడానికి విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాట్టు ఐ.ఐ.టి. హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బి.ఎఎస్. మూర్తి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ విద్యా విధానం మూడేళ్ళ లో గణనీయమైన మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 29 వ తేదిన జరగనున్న జాతీయ విద్యా విధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మనవ వనరుల అభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.టి.ల ఉప కులపతులతో  నిర్వహించిన…

Read Full News
station

స్టేషన్ లోనే శవం…

పోలీస్ స్టేషన్ లో శవం బయట పడి కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ లోనే శవం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్పోలీసు స్టేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారుల కోసం నిర్మించిన టాయిలెట్ లో శవం కనిపించే సరికి సిబ్భంది ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ వ్యక్తి చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తి…

Read Full News
amit bandi

“షా “తో సంజయ్…

బిజెపి తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని ధిల్లీలో కలిశారు. సంజయ్ అధ్యక్షునిక వైతోలగిన తర్వాత ధిల్లీ వెళ్ళడం రదే మొదటి సారి. అయితే, అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసినట్టు సంజయ్ తెలిపారు.

Read Full News
tomato lorry

తుపాకీ గస్తీ..

అసలే ఆకాశాన్ని అంటిన ధరలతో కొండెక్కి కూర్చున్న టమాటోలకి మార్కెట్ లో ఇంతా, అంతా డిమాండ్ లేదు. కూరలోకి ఒక్క టమాట దొరికిన చాలానే ఆలోచన. అందుకే వాటిని సాగుచేస్తున్న రైతులు దొంగల బెడద నుంచి కాపాడలేక నానా తంటాలు పడుతున్నారు. ఎలాగో పంటను కోసి మార్కెట్ కి చేరవేద్దామంటే రవాణా భయం. వాటిని తీసుకువెళ్తున్న లారీ గమ్య స్థానానికి చేరేంత వరకు రైతుకు గుబులే. మొన్న ఆదిలాబాద్ జిల్లలో ఓ టమాటోల లారీ బోల్తా పడగా…

Read Full News
cycle c

“బర్త్ డే” సిప్..

ప్రకృతి సిద్ధమైన నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర పురపాలక , ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ పాయింట్ వద్ద కేకును కట్ చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ అనేక ఔషధ గుణాలు కలిగిన నీరా సేవించడం వల్ల కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా…

Read Full News
Screenshot 2023 07 23 154142

“నయా”గరా…

ములుగు-వాజేడు మండలంలో ఓ ప్రకృతి దృశ్యం వెలుగు చూసింది. అరుణాచలపురానికి కిలోమీటర్ దూరంలో అద్భుత జలపాతం బయటపడింది. ఇంత కాలం సన్నని ధారగా ప్రవహించిన ఈ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలకు తన రూపు మార్చుకొని చూడ చక్కని జలపాతంగా మారింది. స్థానికులు దీన్ని గుండం జలపాతంగా పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ జలపాతం వద్ద నీరు సముద్రపు నీరు మాదిరిగా నీలి రంగులో ఉండడం విశేషం. అందుకే పర్యాటకులు మరి ఆసక్తిగా…

Read Full News
new cj c

కొత్త న్యాయమూర్తి…

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై అరాధేచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read Full News
table

ఆటలూ ముఖ్యం..

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా , మానసికంగా దృఢత్వం పొందగలుగుతారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజాభివృద్ధిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే సమాజం అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు . లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా…

Read Full News
pention

వెయ్యి పెరిగింది…

రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల మంత్రి కొప్పుల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల నుంచి ప్రతీ దివ్యంగులకు రూ.4016 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు…

Read Full News
kailash cf

గ్రేట్ పోలీస్…

దేశంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శప్రాయంగా నిలిచారని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ అన్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారుల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కైలాష్ మాట్లాడుతూ విధుల పట్ల నిబద్దత, అంకితభావం పోలీసు అధికారుల్లో ఎలా ఉంటుందో ఒక పోలీస్ అధికారి తనయుడిగా తనకు తెలుసునని తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో మనవ అక్రమ రవాణా నుంచి మహిళలు, పిల్లలను రక్షించేందుకు జరగుతున్న పోలీసింగ్…

Read Full News
snake

పప్పులో పాము…

కష్టపడి పనిచేసేది బుక్కెడు తిండి కోసమే. అదీ ఇంట్లో సమయం లేకపొతే హోటళ్ళను అశ్రయిస్తాం. అక్కడైన సరైన భోజనం దొరుకుతుందా అంటే నమ్మకం లేదు. హోటళ్ళు వడ్డిస్తున ఆహార పదార్ధాలలో ఇప్పటి వరకు బొద్దింకలు, బల్లులు, చిన్న చిన్న పురుగులను మాత్రమే చూసాం. కానీ, ఒక క్యాంటిన్ లోని ఆహారంలో ఏకంగా పాము వచ్చింది. తిండి విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇంతకంటే పరాకాష్ట మరొకటి ఉండదు. వివరల్లోకి వెళ్తే, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)…

Read Full News