press

సమస్యలు సమ్మతమే…

దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, “జర్నలిస్ట్స్ డిమాండ్ డే”కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్…

Read More
IMG 20240317 WA0041

రన్ “రాణీ” రన్….!

తనైరా కంపెనీతో పాటు బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆదివారం నిర్వహించిన ‘శారీ రన్’ కార్యక్రమం విజయవంతం అయింది. పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. దాదాపు 3 వేల మందికి పైగా మహిళలు చీరకట్టులో పరుగులు పెట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సంప్రదాయ చీరకట్టుతో మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు….

Read More
IMG 20240316 WA0033

జపాన్ బృందం…

జపాన్ కి చెందిన పలువురు ఔత్సాయిక పారిశ్రామిక వేత్తల బృందం ప్రతిష్టాత్మకమైన హైదారాబాద్ ఐఐటీ క్యాంపస్ ని సందర్శించింది.

Read More
IMG 20240315 WA0188

కవిత ఇంట్లో సోదాలు…

తెలంగాణలో మరో కుదుపు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఅర్ కుమార్తె, భారాస ఎం.ఎల్.సి. కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ. డి.) సోదాలు చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ సహా పలు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు విచారణలో భాగంగా సుమారు 10 మంది అధికారుల బృందం సోదాలు చేపట్టినట్టు సమాచారం..

Read More
IMG 20240314 WA0060

కొత్త ప్రిన్సిపల్…

ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ నరేంద్ర కుమార్ ని ప్రభుత్వం నియమించింది. చిన్న పిల్లల శస్త్ర చికిత్స నిపుణులుగా పేరున్న ఆయన ప్రిన్సిపాల్ గా నియామకం కావడం పట్ల పలువురు వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More
IMG 20240312 WA0010

సమస్యలు పట్టించుకోండి..

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారైల క్షేమం’ కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టిపిసిసి ఎన్నారై విభాగం చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జెఏసీ ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల, ఏనుగు రమేష్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం…

Read More
IMG 20240312 WA0051

సన్మానం…

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణాలోని 31జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. హైదారాబాద్ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ సన్మానం జరిగింది.

Read More
IMG 20240312 WA0020

మళ్ళీ”నమో”…

తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమనిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీని మూడో సారి ప్రధానిగా చేద్దామా..? 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా..? అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.”ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నామ స్మరణే వినిపిస్తోందన్నారు. మజ్లీస్‌…

Read More
IMG 20240311 WA0010

త్వరలో నర్సింగ్ డైరెక్టర్…

రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరెట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయగూడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1కోటి 50 లక్షల రూపాయలతో ఆధునికరించిన భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ మిడ్ వైఫరీ శిక్షణ సంస్ధను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగ్ విద్యలో మిడ్ వైఫరీలో శిక్షణ తీసుకున్న వారు 83% ప్రసూతి…

Read More
IMG 20240311 WA0001

భాజపా లోకి…

తెలంగాణలో భారాసకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురు సీనియర్‌ నేతలు భాజపా గూటికి చేరారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌ నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో తరుణ్‌ చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
IMG 20240308 WA0058

పాత బస్తీకి మెట్రో….

హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో రైల్ పరుగు పెట్టనుంది. అఫ్జల్ గంజ్ ఎంబీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 2వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెట్రో పనులు చేపడుతున్నారు. దీంతో పాత నగరం ప్రజలకు మెట్రో అందుబాటులోకి రానుంది. శంకుస్థాపన కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. నేత, ఎం.పీ అససుద్దిన్ ఓవైసీ సహా పలువురు పాల్గొన్నారు.

Read More
IMG 20240304 WA0026

ఆర్ ఆర్ ఆర్….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు…

Read More
rathd sitaka c

“సేవ” కోసం ఆరాటం…

తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం  కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం, బారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్, బిజెపి వైపు అడుగులు వేయడంతో వివిధ జిల్లాల్లో ఆశావాహుల సంఖ్య అధికామవుతోంది. కాంగ్రెస్, భారాస, బిజెపిలలోని సీనియర్ నేతలు, గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి ఆయా పార్టీల అధినేతల బుజ్జగింపులు, హామీలతో వెనక్కి తగ్గిన నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read More