IMG 20240822 WA0001

పోలాండ్ లో ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో సెంట్రల్ యూరప్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ నాయకుడు ప్రధాని మోదీనే కావడం విశేషం. భారత్, పోలాండ్ దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కు చేరుకున్న మోదీకి రాజధాని వార్సాలో ఘన స్వాగతం పలికారు.కాగా, మోదీ పోలాండ్ పర్యటనకు రావడంతో అక్కడి ప్రవాస భారతీయలు ఆనందం వ్యక్తం చేశారు….

Read Full News
IMG 20240820 WA0013

మునిగిన నౌక…

ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాస వంతమైన షిప్‌ మునిగి పోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ దిగ్గజ వ్యాపార వేత్త మైక్‌ లించ్‌ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. మరో 14 మంది ప్రమాదం నుండి బయట పడ్డారు. సిసిలియన్‌ పోర్టు నుండి ఈయాట్‌ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ…

Read Full News
IMG 20240811 WA0014

“అమెజాన్ “డేటా సెంటర్

అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎ.డబ్ల్యూ.ఎస్.) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతి పెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్ లో…

Read Full News
IMG 20240809 WA0006

అభివృద్ధి కంకణం…

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని, ఇప్పుడు…

Read Full News
IMG 20240805 WA0040

పారి పోయిన ప్రధాని..

బంగ్లాదేశ్ లో తీవ్ర రూపం దాల్చిన రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి వెళ్ళిపోయినట్టు సమాచారం అందుతోంది. మిలటరీ హెలీ కాప్టర్ లో హసీనా సోదరితో కలసి భారత్ లో ఆశ్రయం పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆమె లండన్ వైపు పయనమైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ విముక్త పోరాట వీరుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థులు సాగిస్తున్న…

Read Full News
IMG 20240805 WA0006

తెలంగాణకు రండి..

తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఏర్పాటు ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారి పొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సమ్మేళనంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన…

Read Full News
IMG 20240724 WA0025

కుప్ప కూలి…

నేపాల్ రాజధాని ఖాట్మండు త్రి భవన్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్ కి చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో విమానం పడి పోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది సహా 19 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు…

Read Full News
IMG 20240722 WA0004

పోటీ చేయను…

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రేసులో వున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ మనుగడ, దేశ ప్రయోజనాల కోసం పోటీ నుండి పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత అధ్యక్ష పదవిలో పూర్తి కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హరీస్ ను బైడెన్ ప్రతిపాదించారు. కానీ, దీనిపై పార్టీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Read Full News
IMG 20240719 WA0035

షట్.. డౌన్…

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్‌ను విడుదల చేసింది. దాని తర్వాత విండోస్ లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి. పని చేస్తున్నప్పుడు ల్యాప్‌ టాప్‌లు షట్ డౌన్ అవుతున్నాయి. దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్‌ను చూస్తున్నారు. మీ కంప్యూటర్ సమస్యలో…

Read Full News
Screenshot 20240719 151505 WhatsApp

అమెజాన్ అడవుల్లో..

అనేక వందల ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే ఓ అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్ అడవుల్లో సంచరిస్తున్న “మాష్కో పైరో” అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను “సర్వైవల్ ఇంటర్నేషనల్ “అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరూ సమీపం లోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఆహారం కోసం ఈ తెగ వాసులు జనసంచారంలోకి వచ్చినట్టు…

Read Full News
IMG 20240718 WA0002

“పెద్దన్న”కి కరోనా…

అమెరికా అధ్యక్షుడు కు బైడెన్ కరోనా బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బైడెన్ కు వాక్సినేషన్ జరిగిందని, డెలావేర్ లో ఐసొలేషన్ లో ఉంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ తెలిపారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఐసొలేషన్ లో ఉంటూనే బైడెన్ తన విధులను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబందించిన అంశాలను కమలా హ్యారీస్ చూసుకుంటారని బైడెన్ తెలిపారు.

Read Full News
bus peru

లోయలో పడ్డ బస్సు..

దక్షిణ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. అక్కడి స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాజధాని లిమా నుంచి 40 మందికిపైగా ప్రయాణికుల తో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్ని సహాయక…

Read Full News
IMG 20240716 WA0018

మహా మనీషి…

సామాజిక, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం ఫోరం సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించిన ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేదకి కూడు, గూడు, గుడ్డ ఇలా దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కోన్నారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకి రాజకీయాన్ని పరిచయం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర…

Read Full News
IMG 20240714 WA0031

“ట్రంప్” పై కాల్పులు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యయత్నం జరిగింది. కాల్పుల దాడిలో ఆయన తృటిలో బతికి బయట పడ్డారు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. బుల్లెట్కు కుడి చెవికి రాసుకుంటూ దూసుకు పోవడంతో ఆ చెవికి గాయం గాయమైంది. బుల్లెట్ చెవికి తాకడంతో అప్రమత్తమైన ట్రంప్ వెంటనే నేలపై వంగి పోయారు. భద్రతా సిబ్బంది ట్రంప్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో…

Read Full News
Screenshot 20240712 211457 WhatsApp

జస్ట్ మిస్..

ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి.పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది. ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి 176 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని పైలట్లను అభినందించారు.

Read Full News