sun

“బాబాయ్” నిన్నూ వదల…

చంద్రయాన్-౩ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన దృషిని ఇప్పుడు ఏకంగా సూర్యుని పైకి సారించింది. వచ్చే నెల రెండోన మిషన్ సన్ “ఆధిత్య” పేరుతొ మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఆకాశంలోకి దూసుకుపోనున్నట్టు ఇస్రో తెలిపింది. ఆధిత్య –ఎల్1  భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని, ఇది చంద్రుని పైకి పంపిన దానికంటే నలుగు రెట్లు అధికమని,…

Read Full News
IMG 20230826 WA0003

చంద్రునిపై చక్కర్లు…

మూడు రోజుల కిందట చంద్రునిపై కాలు మోపిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటికి వచ్చిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ అది బయటకు వచ్చిన ప్రాంతం నుంచి 8 మీటర్ల దూరం వరకు ప్రయాణించి పరిశోధనలు ప్రారంభించింది. ఈ మేరకు రోవర్ సమర్థవంంగా పని చేస్తోందని ఇస్రో వెల్లడించింది.

Read Full News
IMG 20230825 WA0006

జైలుకి ట్రంప్…

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే  ఆరోపణల్లో ఆయన జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. ఆ దేశ చరిత్రలో మగ్‌షాట్‌ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు ఖైదీ నంబర్‌  పి.01135809 కేటాయించారు. ఈ సందర్భంగా పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్‌షాట్‌) కూడా తీశారు. ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్నాయి.పోలీసులు నమోదు చేసిన రికార్డుల ప్రకారం ట్రంప్‌ ఎత్తు 6.3 అడుగులు. 97…

Read Full News
IMG 20230823 WA0032

భారత “రత్నాలు”…

చంద్రయాన్‌-3ని నింగిలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్‌ మార్క్‌-3 రూపకల్పనలో ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ భారతి కీలకంగా వ్యవహరించారు. 2022 జనవరిలో ఆయన ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకముందు వరకు ఆయన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. చంద్రయాన్‌-3 తోపాటు త్వరలో ఇస్రో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్, సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పూర్వ…

Read Full News
IMG 20230823 WA0008

వచ్చాను “మామా”…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చారిత్రాత్మక ఘనత సాధించింది.చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది.చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి “వచ్చేశా మామా”  అంటూ చందమామని పలకరించింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది. ఇక నేటి నుంచి 14 రోజుల పాట జాబిల్లిపై రోవర్ పరిశోధనలు జరుపుతుంది.. అక్కడి ఖనిజాలు, మట్టి,…

Read Full News
IMG 20230821 WA0004

ఎక్కడ అడుగు వేయాలి….

ధృఢ సంకల్పంతో నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 చంద్రుని పై అడుగు పెట్టడానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు సాంకేతిక పరంగా అన్ని దశలూ విజయవంతంగా దాటుకుంటూ చందమామపై చక్కర్లు కొడుతున్న ల్యాండర్ ఇస్రో శాస్త్రవేత్తలకు చిత్రాల రూపంలో సందేహాలు పంపుతోంది. ల్యాండర్హ హాజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలు తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రునిపై ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు గుంతలు, బండరాళ్లు లేని ప్రదేశాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు ఈ…

Read Full News
IMG 20230816 WA0007

కూలిన “లూనా”…

చంద్రుని పై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా -2 కూలిపోయింది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు భారత్ పంపిన చంద్రయాన్-3 కంటే ముందే చేరుకునేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ లూనా-25 పేరుతో రూపొందించిన వాహక నౌకను ఈ నెల 11వ తేదీన చంద్రమండలం వైపు పంపింది. చంద్ర కక్ష లోకి ప్రవేశించన లూనా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే కూలిపోయింది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మరో రెండు రోజుల్లో అంటే 22న లూనా…

Read Full News
IMG 20230820 WA0004

వచ్చేస్తున్నా…

జాబిల్లి పై వడివడిగా దూసుకు పోతున్న చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. చంద్రుని పై కాలు మోపడానికి ఇంకా కేవలం 25 కిలోమీటర్లు x 134 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ల్యాండర్ మాడ్యుల్ చివరి దశ డీ – బూస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో తెలిపింది. ఇప్పటి నుంచి అన్నీ సవ్యంగా సాగితే 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు ల్యాండర్ చందమామ మీద అడుగు వేస్తుంది.

Read Full News
Screenshot 20230819 165247 WhatsApp 1

చందమామ పై…

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్ మరో అడుగు దూరంలోనే ఉంది. ఈ క్రమంలో ఇస్రో ఆసక్తికరమైన చిత్రాలను విడుదల చేసింది. ఆగస్టు15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన తర్వాత చంద్రుడిపై ల్యాండర్ తీసిన ల్యాండింగ్ ప్రాంత వీడియోలు ఇలా ఉన్నాయి.

Read Full News
IMG 20230816 WA0011

ఉద్రిక్తం….

లిబియా రాజధాని ట్రిపోలిలో సాయుధ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో సుమారు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణకు సరైన కారణాలు ఏమిటనేది తెలియక పోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు సాయుధ వర్గాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read Full News
Screenshot 2023 07 30 160224

రష్యాలో డ్రోన్ దాడులు..

రష్యా రాజధాని మాస్కో లో డ్రోన్ లతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రెండు భావనలు ధ్వంసం అయ్యాయి. దాడులకు పాల్పడేందుకు ఆకాశంలో తిరుగుతున్న కొన్ని డ్రోన్ లను సైన్యం కుల్చివేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందవలసి ఉంది.

Read Full News
Screenshot 2023 07 27 191517

చికాగో వీదుల్లో…

హైదరాబాద్ నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన ఓ యువతి నానా ఇబ్బందులు పడుతోంది. ఉన్నత విద్య కోసం వెళ్ళిందా లేక ఉద్యోగం కోసం వెళ్ళిందా అనే విషయం కచ్చితంగా తెలియకున్నా చికాగో నగరంలో ఆమె రోడ్ల పైనే జీవనం సాగిస్తోంది. ఆమె వివరాలు కూడా పూర్తిగా చెప్పలేక్పోతోంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమచారాన్ని బట్టి ఆమె నగరంలోని మౌలాలి ప్రాంతానికి చెందిన యువతిగా తెలుస్తోంది. విషయం తెలిసిన ఆమె తల్లి విదేశాంగ మంత్రి జై…

Read Full News

కెనడాలో హత్య…

కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒంటారియా ప్రావిన్స్ లో గుర్ విందర్ నాథ్ (24) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మిస్సిసాగా అనే ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్ విందర్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు…

Read Full News
bus

చెరువులో పడి…

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వాళ్ళల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలోని చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన…

Read Full News
kishan usa c

డైరెక్ట్ ఫ్లైట్ ప్లీజ్…

భారత్ -అమెరికాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను మరింత పెంచేందుకు హైద‌రాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని యూఎస్ఎ ఎన్నారైలు అబిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న కిష‌న్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు క‌లిసి త‌మ విజ్ఞ‌ప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులను కలిగి ఉన్నాయ‌ని, అమెరికా నుండి హైదరాబాద్‌కు…

Read Full News