చెరువులో పడి…

bus

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వాళ్ళల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలోని చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణీకులు తెలిపారు. గాయపడ్ద వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *