ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాదవ్కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్కు చేరుకున్నారు.