మణిపూర్ మంట…

speaker

లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ మంట రాజుకుంది. విపక్షాల నినాదాలు, ప్లకార్డులతో పార్లమెంట్ హాల్ హోరెత్తింది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో  సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ  చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి.సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డు లతో దర్శనమిచ్చాయి. “ఇండియా ఫర్ మణిపుర్‌” మణిపుర్‌ పై ప్రధాని ప్రకటన చేయాలి  అంటూ నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *