ఇంతే పడుకుంటా…

Screenshot 2023 07 24 114251

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫలితంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల విషయంలో పడే బాధలు అన్నీ ,ఇన్నీ కావు. గల్లీ గల్లీలో రోడ్ల సమస్య పట్టిపీడిస్తుంది. ఇలాంటి సమస్యతోనే అలసిపోయాడు ఓ వ్యక్తి. రోడ్డు దుర్బర పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి నిరసన తెలియజేయలనుకున్నాడు. అంతే.. నడిరోడ్డుపై కూర్చోలేదు… కానీ పడుకున్నాడు… ఎలా అంటారా…ఏలూరు నగరంలో గంగానమ్మ గుడి వద్ద రహదారిపై నీరు నిలవడంతో ఓ వ్యక్తి వినూత్న నిరసన తెలిపలనుకున్నాడు. దానికి మంచాన్ని ఎన్నుకున్నాడు. రోడ్డు పై నిలిచిన నీటిలో ఏకంగా మంచం వేసుకొని నిరసనకు దిగాడు. కాసేపు ట్రాఫిక్ ని నిలిపేశాడు. రోడ్డు బాగుచేయాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడి వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకువెళ్దామని నచ్చ జెప్పడంతో పక్కకు జరిగాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *