మై హోమ్.. ఐదుగురు మృతి…

Screenshot 2023 07 25 154029

మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ కంపెనీ విస్తరణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పని చేస్తుండగా లిఫ్ట్ కూలి కింద పడడంతో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందినట్టు సమాచారం అందింది. గాయపడ్ద వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *