నేడే చూడండి..గాంధీ…

talasani

రాష్ట్రంలోని అన్ని దియేటర్ లలో ఈ నెల 14 నుండి 24 వ తేదీ వరకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్ల పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలలో భాగంగానే విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని చాటే విధంగా రాష్ట్రంలోని 582 స్క్రీన్ లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. విద్యార్ధులను ధియేటర్ ల వద్దకు ఉచితంగా తీసుకొచ్చి, క్షేమంగా వారి గమ్య స్థానాలకు తీసుకెళ్ళే విధంగా థియేటర్ ల నిర్వహకులు, విద్యా, రవాణా తదితర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించగా లక్షలాది మంది విద్యార్ధులు వీక్షించారని తెలిపారు. ఈ సమావేశంలోచలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *