కడుపులో “కత్తెర”….

IMG 20230817 WA0032

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. స్వప్న అనే మహిళ ప్రసవం కోసం పెద్దాసుపత్రికి వెళితే, ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెరను మరిచారు. బాధితరాలికి  కడుపు నొప్పి రావడంతో వైద్యుల నిర్వాకం బయట పడింది. స్వప్న కు తీవ్ర కడుపు నొప్పి కలగడంతో స్కాన్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో మరోసారి ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ శశిధర్ ని ప్రశ్నించగా కడుపులో కత్తెర మరచిపోయిన విషయం నిజమేనని
చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *