ప్రాణం తీసిన “అందం”..

IMG 20240815 WA0016

భార్య అందంగా తయారవడం సహించలేని ఓ భర్త ఏకంగా ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. భార్య అందంగా తయారు కావడం ఆయనకు ఇష్టం లేదు. అందం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ముదిరిపోయాయి. విడాకుల కోసం చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. మాగడిలో దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా కనపడేందుకు లిప్ స్టిక్ వేసుకునేది. భుజం పై ఓ టాటూ కూడా వేయించుకుంది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విడాకుల కోసం కోర్టు కెళ్లారు. కోర్టు కౌన్సిలింగ్ కి హాజరైన అనంతరం ఇక అనుమానించనని ఆమెను నమ్మించి దివ్యను ఓ గుడికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి అమెను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *