తగ్గేదే లే….

IMG 20240809 WA0013

అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతంలో 18ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక తమిళ స్మగ్లర్ ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్ ఛార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు ఆర్ఎస్ఐ వై విశ్వనాథ్ సానిపాయ బేస్ క్యాంపు నుంచి కూంబింగ్ కు వెళ్లారు. గుర్రపుబాట వైపు ఉన్న వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రాజంపేట వీరబల్లి ఫారెస్టు బీటు పరిధిలో మాదిరెడ్డి గారి పల్లి సమీపంలో కొంతమంది వ్యక్తులు దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, టాస్క్ ఫోర్స్ పోలీసులను గమనించి దుంగలను పడేసి చెట్ల పొదల మధ్య పారిపోయారు. అయితే ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. అతనిని తమిళనాడు, తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకాకు చెందిన దొరైస్వామి (47)గా గుర్తించారు. ఆ ప్రాంతంలో పడిఉన్న 18ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తితో పాటు దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ జీ. శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *