హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్ల పై యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ బృందాలు మెరుపు దాడులకు దిగాయి. సీసీఎస్ టీమ్తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది..శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం, రిజిస్టర్లో కస్టమర్ల వివరాలు నమోదు చేయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయా కేంద్రాలలో పలువురు యువతను అదుపులోకి తీసుకున్నారు.