తెలంగాణ భాష మహా మాధుర్యం..

tamil telug

“తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ భాష” అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడు తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. రవీంద్ర భారతిలో జ‌రిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అంద జేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ, తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని చెప్పారు. స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగని, సమాజానికి కొత్త దనాన్ని అందించడం మన బాధ్యతని పేర్కొన్నారు. మాతృ భాష మన జీవితంతో ముడిపడి ఉంటుందని గవర్నర్ అన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఈ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టు ఎన్ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలని, తెలుగులో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. మాతృ భాష మన జీవితంలో అవసరమనీ, తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాల్లోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *