పోలాండ్ లో ప్రధాని..

IMG 20240822 WA0001

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో సెంట్రల్ యూరప్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ నాయకుడు ప్రధాని మోదీనే కావడం విశేషం. భారత్, పోలాండ్ దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కు చేరుకున్న మోదీకి రాజధాని వార్సాలో ఘన స్వాగతం పలికారు.కాగా, మోదీ పోలాండ్ పర్యటనకు రావడంతో అక్కడి ప్రవాస భారతీయలు ఆనందం వ్యక్తం చేశారు. మోదీ బస చేయబోయే హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. “మా ప్రధాని పోలాండ్‌కు రావడం మాకు సంతోషకరమైన విషయం. ఇది భారత దేశం-పోలాండ్ సంబంధాలను మెరుగు పరిచే ముఖ్యమైన పర్యటన. ఇది పోలాండ్ నుండి భారత దేశానికి పెట్టుబడులను తీసుకు రావడానికి సహాయ పడుతుంది” అని భారత సంతతి పౌరుడు రాజ్‌పాల్ సబ్నానీ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *