భారత భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మక గూడచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (“రా”) చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. రవి నియామకాన్ని మంత్రి మండలి నియామకాల కమిటి ఆమోదించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్, ఛత్తీస్ ఘడ్ క్యాడర్ కు చెందిన రవి సిన్హా ప్రస్తుతం “రా”లో రెండో సీనియర్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే ఈ పదవిలో కొనసాగుతున్న సమంత్ కుమార్ గోయల్ పదవి విరమణ తీసుకోనున్నారు.