“మోడీ” అసహనం…!
అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేపట్టే పనులు, ప్రవేశ పెట్టే పథకాలు అన్నీ ప్రజల ఆమోదం పొందాలనే నిబంధన ఏమీ లేదు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే వ్యతిరేకించ వచ్చు. అప్పటికీ ప్రభుత్వం తీరు మారకపోతే రోడ్డు ఎక్కి నిరసనలు చేయవచ్చు, ధర్నాలు చేపట్టవచ్చు. ప్రశ్నించడం అనేది పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంతేగానీ, ప్రభుత్వం పై గళం విప్పే ప్రతీ వ్యక్తి తీవ్రవాది కాదు. తీవ్రవాదుల ఆశయాలు, వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంటుంది. కానీ, తమ బతుకులకు, మనుగడకు…
