బొద్దింకల “తడాఖా”…!
ప్రజాస్వామ్య దేశంలో ఒకరు చెప్పినట్టు అందరూ వినాలంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఒక్కొక్కరి ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యక్తిగత పోకడలు వేరుగా ఉంటాయి. భారత రాజ్యాంగంలోని అనేక నిబంధనలను ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చివేస్తూ పార్లమెంట్ ద్వారాలు సైతం ముసివేసి మరీ బలవంతపు చట్ట సవరణలు చేసుకుంటున్న ఈ రోజుల్లో, పౌరులు సైతం తమ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతుక్కోవడం తప్పు కాదు. ఈ మార్గాలు రాజ్యాంగ నిబంధనలకు అనుకూలంగా ఉండవచ్చు లేదా కొంత భిన్నంగా…
