Screenshot 20240625 211748 Chrome

బకాయిలు ఇవ్వండి..

జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగ‌ళ‌వారం ఆయ‌న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్ర‌భుత్వం పెడుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను కేంద్ర మంత్రికి వివ‌రించారు. ఆయుష్మాన్ భార‌త్ నిబంధ‌న‌లన్నింటిని తాము ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేస్తున్న‌ట్లు రేవంత్ వివరించారు….

Read More
IMG 20240625 WA0019

అక్రమమిస్తే చర్యలు..

హైదారాబాద్ లోని శేరింగంపల్లి మియాపూర్ లలో ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక్ హెచ్చరించారు.సర్వే నెంబర్లను 100,101 ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములను కాపడలన్నారు.ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

Read More
IMG 20240624 WA0020

భారాస మరో వికెట్..

తెలంగాణాలో భారత రాష్ట్ర సమితికి చెందిన మరో వికెట్ జారీ పోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి జగిత్యాల శాసన సభ్యునిగా ఎన్నికైన సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ లో చేరారు. హైదారాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీల్లోకి ఆహ్వానించారు.

Read More
cancr

వార్షికోత్సవంలో…

హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హిందూపురం ఎంఎల్ఏ బాలకృష్ణ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆస్పత్రి బోర్డ్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వర రావు రేవంత్ కి స్వాగతం పలికారు.

Read More
pongu ksr

ఇళ్ల స్థలాలకు కొత్త పాలసీ

రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ తీసుకు వస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు…

Read More
jai labr c

“అసంఘటిత” పని కావాలి…!

అసంఘటిత కార్మికులకు నెలకు పది రోజులకు తగ్గకుండా పని దినాలు కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని లేబర్ కమిషనర్ ను జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం, పెయింటర్స్ సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం ఇచ్చింది. కమిషనర్ తరుఫున జాయింట్ కమిషనర్ వినతి పత్రాన్ని తీసుకున్నారు. తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలి. అసంఘటిత కార్మికులు అనేక…

Read More
IMG 20240617 WA0021

పది రోజుల పని కావాలి..

తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలని, అసంఘటిత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు ఇచ్చి, గుర్తింపు కార్డులు తీసుకున్న ప్రతి కార్మికునికి నెలకు పది రోజుల పని దినాలకు తగ్గకుండా రోజు వేతనంతో కూడిన పని కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. హైదారాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన జై స్వరాజ్ పార్టీ కార్మిక…

Read More
IMG 20240610 WA0003

పోరుకు “జై స్వరాజ్”

తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలకు జై స్వరాజ్ సిద్ధం అవుతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్ళు దాటినా నేటికీ మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ మాయమాటలతో కాలయాపన చేస్తే, పచ్చి అబద్ధాలతో వచ్చే ఐదేళ్లు వెళ్లబుచ్చే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోందని కేఎస్ఆర్ గౌడ్ వివరించారు. హైదరాబాద్ లో జరిగిన పార్టీ…

Read More
IMG 20240602 WA0049

అభివృద్ధి వ్యూహం…

తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌ రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని ఆయన అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో సీఎం…

Read More
IMG 20240530 WA0034 scaled

ఇక “జయ జయహే”..

’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు…

Read More
IMG 20240527 WA0030

కొత్త “గుర్తు” కోసం…

తెలంగాణా రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. చిహ్నం మార్పు పై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ లో సోమవారం పలు నమూనాలను రేవంత్‌ పరిశీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు కసరత్తు చేస్తోంది. ఆ రోజు కొత్త చిహ్నం ప్రకటించే అవకాశం ఉంది.

Read More
IMG 20240527 WA0029

ఏర్పాట్ల “పరేడ్”…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌడ్స్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభాప్రాంగణం లో ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, సభాప్రాంగణంలో విధ్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, ఎల్ ఇ డి స్ర్కీన్ ల ఏర్పాట్ల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు….

Read More
IMG 20240516 WA0004

‘కులం’ తర్వాతే “పంచాయతీ”

రాష్ర్టంలో కుల గణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. జూన్ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామన్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే పచ్పి మోసగాడుగా రేవంత్ ను ప్రజలు భావిస్తారని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. కుల గణన చేపట్టి, కులాల…

Read More
swaraj

ముమ్మర ప్రచారం..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిష్టాత్మకమైన చేవెళ్ల పా నియోజకవర్గ పరిధిలో జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వారం రోజులుగా పార్టీ కార్యకర్తలతో ప్రచార రథం పై గ్రామ గ్రామం తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. జై స్వరాజ్ పార్టీ ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజలకు వువరిస్తున్నారు. పెన్ను గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

Read More
IMG 20240418 WA0007

మల్కాజిగిరి బరిలో “బాషా”

దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి సీటును జై స్వరాజ్ పార్టీ ఒక ఆటోడ్రైవర్ కి కేటాయించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వాహన చట్టంలోని కఠిన తరమైన నిబంధనలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని డ్రైవర్లు పార్టీ దృష్టికి తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా సామాన్య డ్రైవర్లకు తాము అండగా ఉండాలనే ఆలోచనతో నగరంలోని ఒక ఆటో డ్రైవర్ కు సీటు కేటాయించామని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు…

Read More