ప్రారంభం..పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ లో ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభా సభ్యుల నుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీ లకు ఉభయ సభలు సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే లోక్సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆగస్టు 11 వరకు మొత్తం 17 పని దినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐతే, మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్సు ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు సమర్పించిన నోటీసులను లోక్సభ సచివాలయం అనుమతించింది. పార్లమెంట్ లో అనుసరించిన వ్యూహాలపై రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశమైంది. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహలపై చర్చించారు.