తప్పదిక.... - EAGLE NEWS

తప్పదిక….

sharmila sonia rahul

తన తండ్రి, దివంగత నేత వై,ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. గురువారం దిల్లీలో కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన అనంతరం ఆమె పులివెందుల వెళుతున్నారు. శనివారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో అయన స్మారకం వద్ద నివాళులు అర్పించిన తర్వాత పార్టీ విలీనం పై ప్రకటన చేయవచ్చనే బలమైన ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *